సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ప్రేక్షకులను తన మాటలతో అలరించే రచయిత అయిన త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలా వైకుంఠపురం లో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించి ఆ పనులు మొదలు పెట్టగా ఆ చిత్రం మధ్యలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

 పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయం తెచ్చిపెడుతుందని చిత్రబృందం భావిస్తోంది. గతంలో వీరి కలయిక లో వచ్చిన అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబుతో ఆయన చేస్తున్న ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రావాలని ప్రేక్షకులు ఎంతగానో డిమాండ్ చేయగా వారి కోరిక ఇప్పుడు తీరడం విశేషం. ఆ విధంగా ఇప్పుడు మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమా తరువాత ఈ చిత్రాన్ని చేస్తూ ఉండటం విశేషం.

రికార్డు స్థాయి వసూళ్లు ఈ సినిమాకు వస్తాయి అని విశ్లేషకులు నమ్మకంతో ఉండగా ఈ సినిమా కోసం ఎన్నో స్పెషాలిటీ లను తీసుకువస్తున్నారు త్రివిక్రమ్. బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ను కూడా ఈ చిత్రం కోసం రంగంలోకి డించనున్నట్లుగా తెలుస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించడానికి ఇష్టపడేవారు కాదు కానీ ఇప్పుడు అన్ని సినిమాలు పాన్ ఇండియా స్టాండర్డ్ లో  వస్తూ ఉండటం తో తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇష్ట పడుతున్నారు. సల్మాన్ ఖాన్  అలాగే చాలా మంది హీరోలు తెలుగు సినిమాల్లో చేసే రెడీ అవుతున్నారు. ఆ విధంగా అనిల్ కపూర్ ను త్వరలో ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. ఇంకా పలువురు పరభాషా నటులు కూడా ఈ చిత్రంలో చూడబోతున్నాం. ఏదేమైనా త్రివిక్రమ్ ఇప్పుడున్న ఫామ్లో బాగానే తీస్తాడని అభిమానులు అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: