అంతేకాకుండా గత కొన్ని రోజుల నుండి సాయి పల్లవి నిర్మాతలను కూడా కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సాయి పల్లవి సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకుంది అన్నట్లుగా వార్తలు బాగా వైరల్గా మారాయి. హీరోయిన్ గా ఏ సినిమాలో నటించినా ఈమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు. కానీ సాయి పల్లవి సినిమాలు చేయక పోవడానికి కారణాలు ఏంటో అంటూ చాలామంది పలు రకాలుగా తెలియజేశారు. అయితే ఈమె నటించిన విరాటపర్వం చిత్రం మాత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు. ఇక ఈ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ఈ చిత్రం సాయి పల్లవి కి చివరి చిత్రం కాబోతుందో ఏమో అన్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. దీంతో సాయి పల్లవి ఈ విషయంపై స్పందిస్తూ ఒక పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఆ ఫోటో చాలా వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోలో సాయి పల్లవి చీర కట్టుకొని రోడ్డుమీద పరిగెత్తుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే కేవలం కాళ్లను మాత్రమే చూపించడం జరిగింది.