ఇక చిరంజీవి హీరోగా సురేష్కృష్ణ దర్శకత్వంలో అబు సినిమా ప్లాన్ చేశారు. ఏఆర్. రెహ్మన్ను మ్యూజిక్కు పెట్టి మరీ సినిమాను మొదలు పెట్టి, ఆపేసారు.వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో ఆటా నాదే. వేట నాదే అనుకున్నా మధ్యలో ఆగిపోయింది. నాగార్జున - మహేష్బాబు మణిరత్నం కాంబినేషన్లో రావాల్సిన సినిమా కూడా స్క్రిఫ్ట్ దశలో ఆగిపోయింది.నాగార్జున , ధనుష్ల కాంబోలో ధనుష్ దర్శకత్వంలో నాన్ రుద్రన్ అనే మల్టీస్టారర్ రావాల్సి ఉంది. షూటింగ్ మొదలై ఓ షెడ్యూల్ అయినా కూడా మధ్యలో ఆపేశారు.
ఇక పవర్ స్టార్ నటించిన సత్యాగ్రహి 2003లో ఈ సినిమాను అనౌన్స్ అయ్యింది. దాసరి క్లాప్ కొట్టగా.. విక్టరీ వెంకటేష్ కెమేరా స్విచ్ ఆన్ చేశారు. వినాయక్ ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ హీరోగా జీసస్ క్రైస్ట్ సినిమా అనుకున్నారు. షూటింగ్ కోసం ఇజ్రాయెల్ వెళ్లారు. ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది..ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన మెరుపు సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది..ఇలా చాలా మంది హీరోల సినిమాలు మధ్యలోనే ఆగి పోయాయి. వాటిని ఫ్యుచర్ లో అయిన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో లేదో చూడాలి.