టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్లా దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చాడు.ఇంతకుముందు సూపర్ స్టార్ మహేష్ చేసిన 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'ఆగడు' వంటి సినిమాలకు థమన్ చార్ట్ బస్టర్స్ సాంగ్స్ అందించాడు.ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ సినిమా కోసం తమన్ వర్క్ చేస్తుండటంతో ఫ్యాన్స్ మ్యూజిక్ పై హై ఎక్స్పేక్టేషన్స్ పెట్టుకున్నారు. అందులోనూ ఈమధ్య ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. SVP కి అదిరిపోయే ఆల్బమ్ ఇస్తాడని ఫ్యాన్స్ భావించారు.దీనికి తగ్గట్టుగానే 'కళావతి' 'పెన్నీ' 'మా మా మహేష్' వంటి సూపర్ హిట్ సాంగ్స్ ని కంపోజ్ చేశాడు థమన్. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజీఎమ్ & RR మాత్రం మహేష్ ఫ్యాన్స్ ని ఇంకా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మహేష్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో థమన్ ని బండ బూతులు తిడుతూ ఈ విషయాన్ని మహేష్ ను ట్యాగ్ చేసి మరీ చెప్పారు.


సర్కారు వారి పాటకి బలహీనమైన నేపథ్య సంగీతం అందించిన తర్వాత.. సూపర్ మహేష్ బాబు థమన్ పై కోపంతో తన తదుపరి చిత్రాన్ని అనిరుధ్ రవిచంద్రన్ లేదా మరేదైనా యువ సంగీత దర్శకుడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడని నెట్టింట ఊహాగానాలు వినిపిస్తున్నాయి.మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న SSMB28 చిత్రానికి కూడా థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనలైజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు అధికారికంగా కూడా అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు.కానీ ఇప్పుడు SVP బ్యాగ్రౌండ్ స్కోర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి సంగీత దర్శకుడిని ఖచ్చితంగా మార్చాలని మహేష్ భావించారట. కానీ త్రివిక్రమ్ మాత్రం SSMB28 కోసం ఎలాగైనా అదనపు జాగ్రత్తలు తీసుకుంటానని మహేష్ బాబుకు హామీ ఇచ్చారట. థమన్ తన బెస్ట్ అవుట్ ఫుట్ ను అందించేలా చూస్తానని దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ కి మాటిచ్చారట.మరి థమన్ త్రివిక్రమ్ నమ్మకాన్ని నిలబెట్టుకొని మహేష్ ని ఆయన ఫ్యాన్స్ ని మెప్పిస్తాడో లేదో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: