మహేష్ బాబు వరుస సినిమా లతో బిజీ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ముచ్చటగా మూడో సారి సినిమా చేసేందుకు మహేష్ బాబు సిద్ధమయ్యాడు.  ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో పట్టలెక్కపోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఇటీవలే మహేష్ బాబు తల్లి గారు ఇందిరా దేవి మరణించిన కారణం గా.. ఇక ఈ  సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.  ఇకపోతే ఇటీవల కాలంలో మహేష్ సినిమాలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది.


 అయితే త్రివిక్రమ్ తో సినిమా పూర్తి చేసిన వెంటనే ఇక రాజమౌళి తో సినిమా చేసేందుకు మహేష్ బాబు షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే  ఇటీవల కాలంలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవాలని భావిస్తున్నాడు.  త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.  ఇంకా నటీనటులను ఎంపిక చేయలేదు అని చెప్పాలి. కాగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో మలయాళం తమిళ హిందీ నుంచి నటులను తీసుకోవాలని భావిస్తున్నారు.


 ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో సినిమా గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ కుటుంబంతో మోహన్ బాబుకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకనే మహేష్ ఇక మోహన్ బాబుని అప్రోచ్ అయితే కీలక పాత్ర కోసం ఒప్పుకున్నారూ అని ఇండస్ట్రీలో టాక్.  మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం ఇక అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: