టాలీవుడ్  సీనియర్  హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత చిరు నటిస్తున్న మాస్ మసాలా సినిమా ఇది.ఈ సినిమాకు యంగ్  డైరెక్టర్  బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో మన మెగాస్టార్  చిరంజీవి మత్యకారుడిగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో చిరుతో పాటే మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో వాల్తేరు వీరయ్య సినిమాపై  ఎన్నో భారీ అంచనాలు వున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి బాస్ పార్టీ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. చాలా భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది ఈ మాస్ మసాలా సాంగ్. 


టాలీవుడ్  స్టార్  మ్యూజిక్  డైరెక్టర్  రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటకు మ్యూజిక్ మాత్రమేకాకుండా స్వయంగా లిరిక్స్ కూడా రాయడం విశేషం.ఇక ఈ పాట పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్  కూడా తనదైన రీతిలో స్పందించారు. ఈ పాట చాలా ఫ్రెష్ గా ఉందని ఇంకా దేవీ శ్రీ ప్రసాద్  మరోసారి దుమ్మురేపారని కొనియాడారు రామ్  చరణ్. ఈ పాట గురించి పోస్ట్ చేస్తూ బాస్ మళ్లీ స్ట్రాంగెస్ట్ జోన్ లోకి వచ్చేశారని ఈ పాట ఫ్రెష్ అండ్ సూపర్ గా అదిరింది అంటూ రామ్  చరణ్  ట్వీట్  చేశాడు. దాంతో మెగా అభిమానులు కూడా ఈ పాట పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ ను కూడా విడుదల చేయనున్నారు.మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో అనేది విడుదల అయ్యాక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: