టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, యంగ్ డైరెక్టర్ సుజీత్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఇలా ప్రకటన వచ్చిందో లేదో అలా అభిమానులు వైరల్ చేశారు. దెబ్బకు మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.ప్రభాస్‌తో సుజీత్‌ చేసిన సాహో సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో యావరేజ్ హిట్ గా నిలిచినా ఈ సినిమా స్టైలిష్ సినిమాగా ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ మూవీ ఎంతగానో మెస్మరైజ్‌ చేసింది. దీంతో ప్రస్తుతం సుజీత్‌, పవర్‌ స్టార్‌తో సినిమా అనౌన్స్ అవ్వడంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఫుల్ గా ఖుషీ అవుతున్నారు. పవన్‌ పాన్‌ ఇండియా మూవీకి ఇది పర్‌ఫెక్ట్ అని పవర్ స్టార్ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే వీలైనంత త్వరగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్న మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. అందుకే మూవీని ప్రారంభించింది. సోమవారం నాడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ ఎస్ థమన్‌ కూడా హాజరుకావడంతో ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ అని తెలుస్తోంది. 


ఇక ఈ సినిమా నిర్మాత డివివి దానయ్యతో పాటు అల్లు అరవింద్‌, దిల్‌రాజు ఇంకా సురేశ్‌ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాని 'ఓజీ' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ గ్యంగ్ స్టర్ అనే వర్కింగ్ టైటిల్ బాగా ట్రెండ్ అవుతూ ఎంతగానో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించనున్నారన్న వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.ఇక పూజా కార్యక్రమానికి హాజరైన పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ మంచి స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. ఫుల్‌ బ్లాక్‌ డ్రస్‌లో కొత్త లుక్‌తో ఎంతగానో మెస్మరైజ్‌ చేశారు.ఇంకా ఈ పూజా కార్యక్రామానికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ షేర్‌ చేసింది. ఈ సినిమాని వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తోంది. ఇక డీవివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజిలో ఈ చిత్రాన్ని ఎలాంటి కాంప్రమైజ్‌ లేకుండా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: