బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్, బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే ఈ సినిమాలో నటిస్తూ ఉండగా.. ఇక లోకనాయకుడు కమలహాసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఇంతటి భారీ తారాగణం ఉండడంతో సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇకపోతే ఇటీవలే అమెరికాలోని శాండీయాగో కామికాన్ ఈవెంట్లో టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ ని కూడా చిత్ర బంధం విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఓ హాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఏకంగా ఈ సినిమాలో తన పాత్రతో పాటు సినిమా కాన్సెప్ట్ ఏంటీ అనే విషయాన్ని కూడా చెప్పేసారు.
పురాణాలను, భవిష్యత్తును కలబోసి నాగ్ అశ్విన్ గొప్ప కథను తయారు చేశాడు అంటూ కమల్ చెప్పుకొచ్చాడు. మనమందరం వేల సంవత్సరాలుగా పురాణాలను అనుసరిస్తున్నాం. వాటి గొప్పతనాన్ని ఈ సినిమాలో నాగ్ అశ్విన్ మరింత గొప్పగా చూపించబోతున్నాడు. ఈ సినిమాలో తాను నటిస్తానని ఎవరు ఊహించలేదు. ప్రభాస్ సైతం తనతో ఇదే విషయాన్ని అన్నాడు. ఈ సినిమాకు తనను ఎలా ఒప్పించారనేది ఆశ్చర్యంగా ఉందంటూ ప్రభాస్ తెలిపాడు. పురాణాల గొప్పతనాన్ని ఈ తరానికి చెప్పే విధానం తనకు ఎంతో నచ్చింది. అందుకే విలన్ రోల్ లో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చాడు కమల్ హాసన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి