
కానీ ఈ ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అందులో ఒకటి `హరి హర వీరమల్లు` పార్ట్ 1 కాగా.. `ది రాజా సాబ్` మరొకటి. హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిధి స్క్రీన్ షేర్ చేసుకుంది. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం జూలై 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కు జోడిగా రాజా సాబ్ లో నిధి అగర్వాల్ నటించింది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.
సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే నిధి తాజాగా తనకున్న వింత అలవాటును బయట పెట్టింది. పాపం ఈ బ్యూటీకి రోజు నైట్ మర్డర్ మిస్టరీ సినిమాలు చూస్తేగానీ నిద్ర పట్టట్లేదట. `గైస్.. నేను ప్రతి రాత్రి ఒక మర్డర్ మిస్టరీ చూడాలని ఉంది. ప్రస్తుతం నాకు కొత్త కంటెంట్ దొరకడం లేదు.. దయచేసి నాకు కొన్ని సూచనలు ఇవ్వండి.. ఏ భాష అయినా పర్వాలేదు చూస్తాను` అంటూ నిధి పోస్ట్ పెట్టింది. దాంతో ఫ్యాన్స్ మరియు నెటిజన్లు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వచ్చిన సినిమా పేర్లతో ఆమె కామెంట్ సెక్షన్ ను నింపేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు