బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి డైరెక్షన్లో వస్తున్న రామాయణ మూవీలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్ గానే రామాయణ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేశారు.ఇక ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి.. ఆంజనేయుడు పాత్రలో సన్నీడియోల్ .. రావణుడిగా యష్,మండోదరి పాత్రలో కాజల్  అగర్వాల్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఎప్పుడైతే రామాయణ మూవీలో నటిస్తున్న కొంతమంది ఆర్టిస్టుల పాత్రలను రివీల్ చేశారో అప్పటినుండి సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ పై ట్రోలింగ్ జరుగుతుంది. అదే సాయి పల్లవి.. సాయి పల్లవి సీత పాత్రలో చేస్తోంది.రావణుడి భార్య మందోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.కాజల్ సాయి పల్లవికి సంబంధించిన ఫోటోలు  సోషల్ మీడియా లో షేర్ చేస్తూ రావణుడు చందమామ లాంటి కాజల్ అగర్వాల్ ని వదిలేసి సాయి పల్లవి దగ్గరికి వెళ్తారా అంటూ సాయి పల్లవిని హేళనగా చేస్తూ మాట్లాడుతున్నారు.


అయితే సాయి పల్లవి నాచురల్ బ్యూటీ..ఆమె ఎలాంటి మేకప్ లు వేసుకోదు.కాజల్ అగర్వాల్ మేకప్ లు వేసిన సాయి పల్లవి మేకప్ వేయకపోయినా ఒకేలా ఉంటారు అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారడంతో ఇదే విషయాన్ని చాలా మంది నెటిజన్స్ ట్రోల్ చేస్తూ రావణుడు మండోదరి  కాజల్ ని కాదని సీత సాయి పల్లవి దగ్గరికి వెళ్తారా అంటూ సాయి పల్లవి  పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.ఇక దీనికి సాయి పల్లవి అభిమానులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఇక రాముడు పాత్రలో నటిస్తున్న రన్బీర్ కపూర్ పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.

 ఎందుకంటే గతంలో రణ్బీర్ కపూర్ నేను బీఫ్ లవర్ ని అని, బీఫ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను అని చెప్పారు.అయితే అదే విషయాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ బీఫ్ తినేవాడిని రాముడు పాత్రలో చూపించడం ఏంటో ఇది మన కర్మ అంటూ మాట్లాడుతున్నారు.ఇక సినిమా విడుదలకు ముందే ఇన్ని ట్రోలింగ్స్ జరుగుతున్నాయి అంటే సినిమా విడుదలయ్యాక ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే దేవుళ్ళ పురాణ కథలు సినిమాల రూపంలో వచ్చినప్పుడు కొంతమంది చాలా తప్పులు చేస్తారు.ఆ తప్పులను వెతికి పట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: