
కింగ్డమ్ సినిమాకు మల్టీప్లెక్స్ లలో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయల పెంపు లభించింది. ఈ టికెట్ రేట్లతోనే కింగ్డమ్ మూవీ ప్రీమియర్స్ సైతం ప్రదర్శితం కానున్నాయని తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. కింగ్డమ్ మూవీ సైతం రెండు భాగాలుగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కింగ్డమ్ సినిమా ఏకంగా 130 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
ఈ బడ్జెట్ రికవరీ కావాలంటే టికెట్ రేట్ల పెంపు అవసరం కావడంతో మేకర్స్ టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కింగ్డమ్ ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలను సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయి. నిర్మాత నాగవంశీ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
మరోవైపు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు. విజయ్ దేవరకొండ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఆ సినిమాల ప్రభావం విజయ్ దేవరకొండ కెరీర్ పై కూడా పడింది విజయ్ దేవరకొండ పారితోషికం ప్రస్తుతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. కింగ్డమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సితార బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.