
పల్లవి ప్రశాంత్..ఈ పేరు కంటే ఎక్కువగా రైతుబిడ్డ అనే ట్యాగ్ తోనే ఈయన ఫేమస్ అయ్యారు.బిగ్ బాస్ 7 లో కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుంది అని అనూహ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని హౌస్ లోకి పంపించారు. అయితే ముందు నుండి అందరితో ఎక్కువగా కలవలేక పోయారు. దానికి కారణం వారు మాట్లాడుకునే మాటలు పల్లవి ప్రశాంత్ కి ఎక్కువగా అర్థమయ్యేవి కావు.అలాగే ప్రతిసారి ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు. కానీ హీరో శివాజీ, యావర్ ఆయనతో ఫ్రెండ్లీగా కలిసిపోయారు. రతిక కూడా మధ్య మధ్యలో పులిహోర కలిపినప్పటికీ రతికగా నిజ స్వరూపం తెలిసి ఆమెను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఏకంగా అక్కా అంటూ సంబోధించడం అందరిని షాకింగ్ కి గురిచేసింది. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ టైటిల్ గెల్చుకోవడంతో ఎంతోమంది సామాన్యులు సంతోషపడ్డారు.