
ఇక తాజాగా పాత ఇంటర్వ్యూలో నాగార్జున సోదరి, చైతూ మేనత్త నాగసుశీల చేసిన కామెంట్స్ మళ్లీ వైరల్గా మారాయి. తన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ – "మా కుటుంబంలో నాగార్జున, నాగచైతన్య, సుమంత్ వంటి వారు సినిమా రంగం వాళ్లతోనే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎందుకంటే వారు ఫీల్డ్ను అర్థం చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది కూడా సరిపోదు. చైతూ విషయంలో అలాంటిదే జరిగింది. దీనిలో ఎవరినీ నిందించడం సరికాదు. భార్యాభర్తల విషయాల్లో మూడో వ్యక్తికి సంబంధం ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడకుండా విడిపోవడమే మంచిది," అని స్పష్టం చేశారు.
మరింతగా ఆమె చెప్పిన మాటలు – "సమాజం కోసం, పరువు కోసం ఇబ్బందులు భరించాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు. విడాకుల తర్వాత కూడా మంచి స్నేహితుల్లా మిగిలిపోవచ్చు. నేను అలాంటి జంటల్ని చాలా చూశాను. కానీ ఇంకా కొందరు మాత్రం కొట్టుకుంటూ జీవిస్తున్నారు. అది మంచిది కాదు," అంటూ తేల్చి చెప్పారు. నాగసుశీల ఈ మాటలు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆమె చెప్పింది నిజమని, చైతూ–సామ్ ఇబ్బంది లేకుండా విడిపోయినట్లే కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరూ నేరుగా రియాక్ట్ కాకపోయినా, నాగ్ సిస్టర్ మాటలు వారి మైండ్సెట్ని కొంతవరకు క్లియర్ చేశాయనే చెప్పాలి.