
ఒకవైపు తన భార్య ఆర్తి విడాకుల కేసు విచారణ జరుగుతూ ఉన్న సమయంలోనే ఇలా కేనీషాతో కలిసి బహిరంగంగా కలిసి కనిపిస్తున్నారు. కెనీషా వల్లే తమ వైవాహిక బంధం విడిపోవడానికి కారణమంటూ జయం రవి భార్య ఆర్తి కోర్టులో కూడా ఆవేదన తెలియజేసింది. కెనీషా దుబాయ్ కి కేవలం క్రికెట్ మ్యాచ్ చూడడానికే కాదు ఆమె అక్కడ ఒక ఈవెంట్లో పాల్గొనేందుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనకు జరిగిన ఒక వింత అనుభవాన్ని కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. మొత్తానికి మరొకసారి ఈ జంట ఇలా అడ్డంగా బుక్ అవడంతో మరొకసారి వార్తలలో నిలుస్తున్నారు జయం రవి.
త్వరలోనే జయం రవి, కెనీషా వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం పైన మాత్రం ఇప్పటి వరకు వీరు ఖండించలేదు అంతేకాకుండా పలు రకాల ఈవెంట్స్ కి కూడా ఇద్దరూ కలిసి వెళ్లడం మరింత బలాన్ని చేకూరుస్తోంది.