కర్నూలులో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా ఎంతో హృదయవిదారక ఘటన. ఈ ఘటన వార్త బయటకు వచ్చిన వెంటనే ప్రజలతో పాటు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ ఘటనపై తన గుండె నిండిన బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసింది. రష్మిక తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక హృదయాన్ని కదిలించే నోట్‌ను షేర్ చేస్తూ –“ఇలాంటి సంఘటనలు ప్రతిసారీ మన మనసును చిదిమేస్తుంటాయి.
 

ఆ మంటల్లో చిక్కుకున్న చిన్న పిల్లలు, మహిళలు, కుటుంబ సభ్యులు చివరి క్షణాల్లో ఎదుర్కొన్న వేదనను ఊహించుకోవడం కూడా భరించలేని విషయం. ఎంత భయంకరంగా ఆ మంటల్లో వారు తల్లడిల్లి ఉండారో తలుచుకుంటేనే గుండె కట్టేసుకుంటుంది. ఇది ఎవరికి జరగకూడని దుస్థితి. దయచేసి ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు అందరం బాధ్యతగా వ్యవహరించాలి,” అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు రష్మిక మనసు ఎంత సున్నితమో, ఎంత సహానుభూతితో నిండిందో చెబుతూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది కామెంట్స్‌లో ఇలా రాశారు –“నిజంగా గ్రేట్ రష్మిక… ఇప్పటివరకు ఒక్క హీరోయిన్ కూడా ఈ ఘటనపై ఇలా స్పందించలేదు. నువ్వు కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండవు, మనసుతో కూడా స్పందిస్తావు. హీరోయిన్ అంటే నీలాంటి వాళ్లు కావాలి!”



మరికొందరు అభిమానులు –“ఇలాంటి ఘటనలపై స్పందించే నీ మనసు నిజంగా గొప్పది. నీకు ఉన్న సెన్సిటివిటీ, హ్యూమానిటీ అందరికీ ప్రేరణ కావాలి,” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక రష్మిక పోస్ట్ కేవలం అభిమానుల మధ్యనే కాదు, ఇతర సెలబ్రిటీలలో కూడా చర్చకు దారి తీసింది. చాలా మంది సినీ ప్రముఖులు ఆమె పోస్టును షేర్ చేస్తూ తమ సంతాపాన్ని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రష్మిక వ్యాఖ్యలు ఒక సామాజిక సందేశంగా మారాయి. ఆమె చెప్పిన మాటల్లోని హృదయపూర్వకత ప్రజల హృదయాలను తాకింది. ఈ ఘటన రష్మికను బాగా కలిచివేసినట్లు ఆమె భావోద్వేగ పదజాలం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఒకవైపు దేశం ఈ దుర్ఘటన వల్ల విషాదంలో మునిగిపోతుండగా, మరోవైపు రష్మికలాంటి స్టార్‌లు మానవత్వంతో స్పందించడం ప్రజల్లో మళ్లీ ఆశను నింపుతోంది. ఆమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, వేలాది మంది షేర్ చేస్తున్నారు.కర్నూలు బస్సు ప్రమాదం బాధితుల పట్ల ఆమె చూపించిన హృదయస్పర్శి స్పందన ఇప్పుడంతా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: