మొదటగా నిర్మాత నిరంజన్ రెడ్డి తానే ముందుకు వచ్చి మొత్తం వ్యవహారాన్ని పబ్లిక్గా బయటపెట్టారు. తాను ఇప్పటివరకు ప్రశాంత్ వర్మకు ఇచ్చిన మొత్తం, ఎప్పుడు, ఏ ప్రాజెక్ట్ కోసం, ఏ విధంగా చెల్లించానన్న విషయాలను అంచెలంచెలుగా వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం — మొత్తం మీద 20 కోట్లకు పైగా తాను చెల్లించానని, కానీ ప్రతిఫలం రాలేదని తెలిపారు.ఇంతకే ఆగకుండా, తనతో చేయాలని అంగీకరించి తరువాత వేరే సంస్థలకు వెళ్లిపోయిన మహాకాళి, జై హనుమాన్, అధీరా వంటి ప్రాజెక్టుల విషయంలో కూడా పెద్ద ఆరోపణలు చేశారు. ఆ సినిమాలకు సంబంధించి తానూ భాగస్వామినని, కనీసం 200 కోట్ల వరకు రాయల్టీ రూపంలో చెల్లింపులు జరగాల్సి ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సినిమాల నిర్మాణ సంస్థలు ముందుకు వెళ్లకూడదని, లీగల్ హెచ్చరిక కూడా ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఆరోపణలకు ప్రశాంత్ వర్మ కూడా గట్టిగానే బదులిచ్చారు. పేజీలకొద్దీ సమాధానాలు ఇస్తూ, ప్రతి ఆరోపణకు స్టెప్ బై స్టెప్ వివరణ ఇచ్చారు. తన వాదన ప్రకారం — నిరంజన్ రెడ్డి వల్లే తాను కెరీర్ పరంగా నష్టపోయానని, చాలా అవకాశాలు కోల్పోయానని పేర్కొన్నారు. అంతేకాదు, తానే నష్టపోయిన వ్యక్తినని, తాను ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, పైగా తనకే నష్టపరిహారం ఇవ్వాలని కూడా ప్రశాంత్ వర్మ డిమాండ్ చేశారు.ఇప్పుడు ఈ వివాదం ఏ దిశగా మలుపు తిరుగుతుందో చూడాలి. ఇరువురు తమ తమ ఆధారాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నారని సమాచారం. ఇప్పటికే నిర్మాతల మండలి మధ్యవర్తిత్వం చేపట్టిందని, కానీ సమస్య ఇంకా పరిష్కార దశకు రాలేదని తెలిసింది. ఈ సీన్ ఎప్పుడు క్లీన్ అవుతుందో, ఎవరి పక్షం నిజమో అనేది ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఇప్పుడు ఆయన కమిట్ అయిన సినిమాల పరిస్ధితి ఏంటి..? జై హనుమాన్ , మహాకాళి ,అధీరా విషయంలో ఆయన స్టెప్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి