ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు రాజు వెడ్స్ రాంబాయి. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన విలేజ్ లవ్ స్టోరీ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించడంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో హీరోయిన్ల నటించారు. వీరిద్దరికీ ఇదే మొదటి చిత్రమైనప్పటికీ ఇందులో అద్భుతంగా నటించారు. అలాగే సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ ఇందులో విలన్ పాత్రలో హైలెట్గా నిలిచారు.


నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కూడా అంచనాలను మించి మరి కలెక్షన్స్ రాబడుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ ఇప్పటివరకు రూ.15 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటిలో వస్తుందా అని ఓటిటి లవర్స్ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి వారి కోసమే తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.


సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ హక్కులను ఈటీవీ విన్  సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ తీసుకురావాలనే డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అంటే జనవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటిలో స్ట్రిమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  చిన్న సినిమాగా వచ్చి ప్రశంసలు అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా టికెట్ ధర కూడా వంద రూపాయలు లోపు విడుదల చేయడంతో ఈ సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడింది. సినిమా సక్సెస్ ఈవెంట్ కూడా హైలెట్ గా నిలిచింది.మరి ఓటీటిలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: