ప్రస్తుత రోజులలో మహిళలపై చాలా అనర్ధలు జరుగుతున్నాయి. అనేక అత్యాచారాలు మహిళలపై  జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు ప్రవేశ పెట్టిన కూడా మారని ఎలాంటి వారిని ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే ..అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఆస్పత్రిలోని అత్యవస విభాగంలో నర్సుగా పని చేసిన ఓ వ్యక్తి 24 మంది బాలికలు సహా 206 మంది మహిళా రోగులపై అత్యాచారాలు చేశాడు. అతని పేరు మైఖేల్ డేవిడ్ బ్రాగ్గ్(39) అనే వ్యక్తి యూపీఎంసీ కార్లిస్లే ఆస్పత్రి అత్యవసర విభాగంలో 2016 జనవరి నుంచి 2019 ఏప్రిల్ 19 వరకు నర్స్‌గా పని చేయడం జరిగింది. ఈ సమయంలో ఐసీయూలో ఉన్న  మహిళా రోగులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు ఈ కామందుడు.

 

 

అసలు తీవ్రమైన అనారోగ్యంతో అత్యవసర వైద్య సహాయం కోసం వచ్చిన మహిళా  రోగులపై  ఈ విభాగంలో చేరిన రోగుల నిస్సహాయతను ఆసరగా చేసుకొని బ్రాగ్గ్ దారుణాలకు పాల్పడ్డాడు ఈ కామందుడు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో అతడి ల్యాప్‌టాప్‌లో చిన్న పిల్లల పోర్నోగ్రఫీకి గురించి వీడియోలు బయట పడటంతో పోలీసులు బ్రాగ్గ్‌ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.  ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో  విచారణ కూడా నిర్వహిచడం జరిగింది. విచారణలో భాగంగా అతడి ల్యాప్‌టాప్‌లోని వీడియోలను చూసి పోలీసులు షాక్ అవ్వడం జరిగింది. 

 

ఆ  వీడియోలో   ఆసుపత్రిలోని ఐసీయూలో ఆపస్మారక స్థితిలో ఉన్న మహిళను నగ్నంగా చేసి అత్యాచారానికి పాల్పడుతూ ఆ వీడియో తీసుకున్నాడు ఆ దరిద్రుడు. దీనితో పాటు అత్యవసర విభాగంలో మరో మహిళపై లైంగిక హింస కూడా చేయడం జరిగింది. ఇలా 24 మంది బాలికలు సహా దాదాపు 206 మందిపై అత్యాచారాలు చేశాడు ఈ కామందుడు. ఇలా మహిళపై లైంగిక హింస చేసిన అన్నీ అశ్లీల వీడియోలు తన ల్యాప్‌ట్యాబ్‌లో భద్రపరచుకున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం  ఈ కేసు పెన్సిల్వేనియా కోర్టులో విచారణ దశలో ఉండడం గమనార్థకం. 

మరింత సమాచారం తెలుసుకోండి: