ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. కనీసం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం కూడా దాటి బయటకు రావడం లేదు. ఎన్నికలు ఏవైనా సరే... జగన్ తీరు ఇదే. ఎన్నిక ఏదైనా సరే... ఎంత కీలకమైనా సరే... కాలు బయట పెట్టడం లేదు. ఒక్కసారి కూడా అటు వైపు చూడటం లేదు. కానీ వెనకుండి చక్రం తిప్పుతున్నారు. గెలిచేస్తున్నారు. అది కూడా అలా ఇలా కాదు... బంపర్ మెజారిటీతో. చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల సమయంలో కూడా జగన్ ఏ మాత్రం పాల్గొనలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు కూడా దూరంగానే ఉన్నారు. కేవలం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఇక రెండున్నర ఏళ్ల పరిపాలనలో అయితే... కేవలం ఒక్కటంటే ఒక్కటే ప్రెస్ మీట్ నిర్వహించారు. అది కూడా గతేడాది మార్చి నెలలో. లాక్ డౌన్కు ముందు. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రెస్ ముందుకు వచ్చారు. అంతే... ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. తిరుపతి, పులివెందుల అంతే తప్ప... మరే పర్యటన లేదు. అయినా సరే... ఎన్నికల్లో మాత్రం గెలిచేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. కనీసం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం కూడా దాటి బయటకు రావడం లేదు. ఎన్నికలు ఏవైనా సరే... జగన్ తీరు ఇదే. ఎన్నిక ఏదైనా సరే... ఎంత కీలకమైనా సరే... కాలు బయట పెట్టడం లేదు. ఒక్కసారి కూడా అటు వైపు చూడటం లేదు. కానీ వెనకుండి చక్రం తిప్పుతున్నారు. గెలిచేస్తున్నారు. అది కూడా అలా ఇలా కాదు... బంపర్ మెజారిటీతో. చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల సమయంలో కూడా జగన్ ఏ మాత్రం పాల్గొనలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు కూడా దూరంగానే ఉన్నారు. కేవలం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఇక రెండున్నర ఏళ్ల పరిపాలనలో అయితే... కేవలం ఒక్కటంటే ఒక్కటే ప్రెస్ మీట్ నిర్వహించారు. అది కూడా గతేడాది మార్చి నెలలో. లాక్ డౌన్కు ముందు. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రెస్ ముందుకు వచ్చారు. అంతే... ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. తిరుపతి, పులివెందుల అంతే తప్ప... మరే పర్యటన లేదు. అయినా సరే... ఎన్నికల్లో మాత్రం గెలిచేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.