ఇసుక కొరత సమస్యకు నిరసనగా.. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలోనో..గోదావరి పక్కనే ఉన్న రాజమండ్రిలోనో లాంగ్మార్చ్ పెట్టాల్సి ఉండగా విశాఖలో ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
“ ఐదేళ్లలో ఇసుక దోపిడీ జరిగినప్పుడు పవన్కు లాంగ్ మార్చ్ గుర్తుకు రాలేదా ...చంద్రబాబు ఆదేశాలతో పవన్ విశాఖలో లాంగ్మార్చ్ పెట్టారు. చంద్రబాబు ఇంటి పక్కనే కోట్లాది రూపాయల ఇసుక తవ్వుకుంటే పవన్ ఏం చేశారు.. చంద్రబాబు ఇసుక తవ్వకాల కారణంగా గ్రీన్ ట్రిబ్యూనల్ రూ.100 కోట్ల జరిమానా విధించింది పవన్కు తెలియదా .. అని నిలదీశారు.
లాంగ్మార్చ్ పవన్కు సూటవ్వదని, ఆయన చేసేవన్నీ షార్ట్మార్చ్లే అని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. విశాఖలో లాంగ్మార్చ్ చేపట్టిన జనసేన అధినేత పవన్కు చంద్రబాబు నుంచి ఎంత ప్యాకేజీ ముట్టిందో సమాధానం చెప్పాలని ధర్మశ్రీ ప్రశ్నించారు. చంద్రబాబు-పవన్ ఇద్దరూ కలిసి నాటకాలాడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.
పవన్ చంద్రబాబుకు దత్తపుత్రుడని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. విశాఖలో కరుణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. 2013 నుంచి 2019 వరకు పవన్ చేసిన లాంగ్మార్చ్లో చంద్రబాబు నుంచి ఎంత ప్యాకేజీ ముట్టిందో చెప్పాలన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకున్న డబ్బును పవన్కు పంచారని, ఆ డబ్బుతో పవన్ గాజువాకలో పంచారని ఆరోపించారు. నిండుకుండలా నదులు పారుతుంటే ఇసుక ఎక్కడి నుంచి దొరుకుతుందని ప్రశ్నించారు. మొన్న గుంటూరులో దీక్షా డ్రామా చంద్రబాబు సొంత కుమారుడు లోకేష్ ఆడితే..రేపు ఆయన దత్తపుత్రుడు పవన్ లాంగ్మార్చ్ డ్రామా ఆడబోతున్నారని ఎద్దేవా చేశారు.