ప్రస్తుతం ఎక్కడ చూసిన వినపడే మాట అక్రమ సంబంధాలు.. కట్టుకున్న వారు ఉండగానే మరో వ్యక్తితో సంబంధాలను పెట్టుకుంటున్నారు. ఆ పిచ్చిలో కట్టుకున్న వాళ్ళను చంపి అడ్డు తొలగించకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబాలను చిన్నా భిన్నం చేస్తున్నారు. ఈ మేరకు దేశంలో ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తో లేని సుఖం మరో వ్యక్తి తో ఉందని అనుకున్న ఆ వీర వనిత వారి శృంగారానికి భర్త అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపేసింది.



వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తినే ప్రియుడి తో కలిసి ఓ మహిళ కిరాతకంగా హత్య చేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో వారు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమెను,ప్రియుడిని వీళ్లకు సహకరించిన మరోక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ హత్య పోలీసులకు తల నొప్పిగా మారింది.



డెంకణికోటకు చెందిన ప్రేమ, మాదేశ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. మాదేశ్‌ టైలర్‌గా, ప్రేమ ఓ గార్మెంట్స్‌లో పనికి వెళ్లేది. ఆనందంగా సాగుతున్న వీరి జీవితం లో మరో వ్యక్తి ప్రవేశించాడు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రేమ ఇంటి వద్దే ఉండేది. ఈ సమయంలో ప్రేమకు శివమల్ల అనే వ్యక్తి తో పరిచయమైంది ఆ పరిచయం కాస్త శారీరక సంబందానికి దారి తీసింది. వారు శృంగారానికి భర్త అడ్డుగా ఉన్నాడని తొలగించుకోవాలని ప్లాన్ వేశారు.  దాంతో భర్తను చంపేశారు. పోలీసులు గట్టిగా అడగటం తో అసలు విషయం తెలిసింది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: