వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తినే ప్రియుడి తో కలిసి ఓ మహిళ కిరాతకంగా హత్య చేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో వారు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమెను,ప్రియుడిని వీళ్లకు సహకరించిన మరోక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ హత్య పోలీసులకు తల నొప్పిగా మారింది.
డెంకణికోటకు చెందిన ప్రేమ, మాదేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. మాదేశ్ టైలర్గా, ప్రేమ ఓ గార్మెంట్స్లో పనికి వెళ్లేది. ఆనందంగా సాగుతున్న వీరి జీవితం లో మరో వ్యక్తి ప్రవేశించాడు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రేమ ఇంటి వద్దే ఉండేది. ఈ సమయంలో ప్రేమకు శివమల్ల అనే వ్యక్తి తో పరిచయమైంది ఆ పరిచయం కాస్త శారీరక సంబందానికి దారి తీసింది. వారు శృంగారానికి భర్త అడ్డుగా ఉన్నాడని తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. దాంతో భర్తను చంపేశారు. పోలీసులు గట్టిగా అడగటం తో అసలు విషయం తెలిసింది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..