జీహెచ్ఎంసీ కౌంటింగ్ సందర్భంగా స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర ఏ గుర్తులు ఉన్నా వాటన్నింటినీ లెక్కించాలని ఎస్ఈసీ ఇచ్చిన సర్క్యులర్ వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హౌజ్ మోషన్ లో భాగంగా విచారించిన న్యాయస్థానం ఎస్ఈసీ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దింతో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్ను విచారించబోమని తేల్చిచెప్పింది. బ్యాలెట్ పేపర్పై ఏ గుర్తులు ఉన్నా లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల కొన్ని కేంద్రాల్లో ఓటర్లకు స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులను ఇచ్చి తప్పిదం చేశారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులతో ఒక డివిజన్ ఫలితాలు మాత్రమే ఆగిపోయాయని, రేపు ఈ కేసును సింగిల్ జడ్జి మొదటి కేసుగా విచారించనున్న తరుణంలో అభ్యంతరాలుంటే అక్కడే చెప్పుకోవాలని సూచించింది.
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సరికాదని ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది వాదించారు. ఏ గుర్తు ఉన్నా ఆ బ్యాలెట్ పేపర్లను కూడా లెక్కిం చాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీచేయడం నిబంధనలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయమేనని స్పష్టం చేసింది. కాగా రేపు ఉదయం మరోసారి ఈ కేసు విచారణకు రానుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీసుల సాక్షిగా తనకు అన్యాయం జరిగిందని నేరేడ్మెట్ బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఆరోపించారు. 136 డివిజన్లో రీ పోలింగ్ నిర్వహించాలని ప్రసన్న డిమాండ్ చేశారు.
స్వస్తిక్ గుర్తుకు బదులుగా పోలింగ్ కేంద్రం నంబర్ సూచించే గుర్తులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్పై ఏ రకమైన గుర్తులు ఉన్నాయనే విషయంలో స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల కమిషన్ను కౌంటర్ దాఖలు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి