ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు తల్లి గోవిందమ్మ(87) శనివారం ఉదయం హైదరాబాద్లో మృతిచెందారు. ఆమె కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో భాద పడుతుండగా..చికిత్స పొందతూ ఉంది. శనివారం ఉదయం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.గోవిందమ్మ భౌతికకాయాన్ని ఆమె స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింగ్పల్లికి తరలించనున్నారు.
గోవిందమ్మ భౌతికకాయాన్ని అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలోని ఆమె స్వగ్రామం నార్సింగ్ పల్లికి తరలించనున్నారు. అక్కడే రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. డీజీపీ జేవీ రాముడు తల్లి మరణవార్త తెలిసిన సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ఆయనను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.