
87 ఏళ్ల ఉషా గుప్తా భర్త రాజ్ కుమార్ వైరస్ బారిన పడ్డారు. ఢిల్లీ లోని బాత్రా ఆసుపత్రిలో చేరి 27 రోజుల పోరాటం తరువాత, ఉష భర్త మరణించారు. ఈ సమయంలో ఆసుపత్రిలో, రోగులు మరియు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న నిస్సహాయతను ఉష చూసింది. ఆమె భర్త రెండుసార్లు ఆక్సిజన్ లేకపోవడంతో బాధపడ్డారు. ఆక్సీజన్ లేకపోవడం తమను చాలా ఇబ్బంది పెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఆర్థికంగా బలంగా లేని కుటుంబాలను కరోనా ఎలా ప్రభావితం చేస్తుందో తాను చూశానని ఉష మీడియాకు వివరించారు.
హాస్పిటల్లో ఆమె చూసిన బాధ ఆమె జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి ఇంట్లో ఊరగాయలను తయారు చేయడం ద్వారా డబ్బులు సంపాదించి పేదలకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉష 'పిక్ల్డ్ విత్ లవ్' జులై 2021 లో ప్రయాణం ప్రారంభించారు. అక్కడ నుంచి ఆమె విక్రయించడం మొదలుపెట్టి పేదలకు అండగా నిలబడ్డారు. వెంచర్ ప్రారంభించడానికి ప్రేరణ ఆమె మనవరాలు అని చెప్పింది. ఢిల్లీలో పీడియాట్రిషియన్ అయిన రాధిక బాత్రా... తన అమ్మమ్మకు సహకరించారు. అవసరమైన వస్తువులు- తాజా పదార్థాలు, సీసాలు, లేబుల్ ప్రింటర్లు ఇతర వస్తువులు అందించారు.