నెక్లెస్ రోడ్డు లో స్ఫూర్తి స్థల్ లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 80 వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భ్ంగా నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణ లో మనము ఉన్నామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  రాజకీయ విలువలు కాపాడడం లో జై పాల్ రెడ్డి ఒకరని.. దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జై పాల్ రెడ్డి తీసుకున్నారన్నారు రేవంత్ రెడ్డి.  కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ లో జై పాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని.. జై పాల్ రెడ్డి ఆశయాలు కు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదని వెల్లడించారు రేవంత్ రెడ్డి.  కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆయన ఆశయాలు నెరవేరతాయని... రాజకీయాలు అంటే పార్టీ ఫిరాయింపుల, కొనుగోళ్ళు , కాంట్రాక్ట్ లు గా కేసీఆర్ చేశారన్నారు రేవంత్ రెడ్డి.

 జైపాల్ రెడ్డి స్ఫూర్తి ని మేము కొనసాగిస్తామని స్పస్టం చేశౄరు రేవంత్ రెడ్డి. పీవీ, మర్రి చెన్నా రెడ్డి సరసన నిలిచే నాయకులు జైపాల్ రెడ్డి అని కొనియాడారు రేవంత్ రెడ్డి.  అనంతరం వీ హెచ్ మీడియాతో మాట్లాడుతూ... ఏ పార్టీ లో ఉన్న అందరి తో కలిసి మెలిసి జైపాల్ రెడ్డి పని చేశారన్నారు.  జైపాల్ రెడ్డి లేని లోటు దేశానికి చాలా లోటు అని... కేంద్ర మంత్రి గా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు వీ హెచ్.  నిత్యం పార్టీ, దేశం కోసం ఆలోచించే వారన్నారు వీ హెచ్.  జై పాల్ రెడ్డి ఒక మహా నాయకుడు అని... తెలంగాణ లో అన్ని పార్టీ లు వారు ప్రేమించే వ్యక్తి అని కొనియాడారు వీ హెచ్.  దేశ రాజకీయాలు లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని.. రాష్ట్ర ఏర్పాటు లో చాలా కీలక పాత్ర వహించారని చెప్పారు.  పార్లమెంట్ లో జై పాల్ రెడ్డి మాట్లాడితే డిక్షనరీ చూసుకునే వారని వెల్లడించారు వీ హెచ్.

మరింత సమాచారం తెలుసుకోండి: