![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/devulapalli-amar-ap-jagan-ycp-journalistc357f2fe-3856-4881-8a6a-9ea273f64de0-415x250.jpg)
- పేదల కష్టాలపై కథనాలు రాసే వ్యక్తి.
- జర్నలిస్ట్ నుంచి జాతీయ మీడియా అధ్యక్షుడిగా ఎదిగిన వైనం..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ప్రభుత్వాన్ని నడపడం కోసం పేద ప్రజల కష్టాలను తీర్చడం కోసం నిరంతర కృషి చేశారు చేస్తున్నారు కూడా. అలాంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకుల నుంచి మొదలు అధికారులు, సలహాదారులు కూడా చాలా సమర్థులై ఉండాలనే ఆలోచన చేశారు. దానికోసం ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సమర్థవంతమైన వ్యక్తులు ఉన్నారో వారిని గుర్తించి , వారిని తీసుకొచ్చి తన పక్కన పెట్టుకున్నాడు. వారి సలహాలు, సూచనలతో పేద ప్రజలను దారిద్ర్యం నుంచి గట్టెక్కించారు. జగన్ నమ్మిన బంట్లలో దేవులపల్లి అమర్ కూడా ఒకరు. మరి ఆయన ఎవరు అనే వివరాలు చూద్దాం.. చాలామందికి దేవులపల్లి అనే పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాలలోని దేవులపల్లి రామానుజరావు గుర్తుకొస్తారు. పండితులుగా మంచి పేరు పొందారు. నిజాం పరిపాలన కాలంలో గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించారు రామానుజ రావు.