నిన్నటి రోజున తెలంగాణ రాజకీయాలలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పెను సంచలనాన్ని సృష్టించింది. దీంతో ఆమె కొత్త పార్టీ పెట్టబోతోందని.. కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతుందనే విధంగా పలు రకాల వార్తలు వినిపించాయి. అంతేకాకుండా కవిత బిఆర్ఎస్ పార్టీలో చాలా దేయ్యాలు ఉన్నాయంటూ ఎద్దేవ చేసేలా మాట్లాడింది. అయితే గడిచిన కొన్ని గంటల క్రితం కేటీఆర్ కూడా అన్ని విషయాల పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నిలదీశారు. బిజెపి పార్టీ పైన కామెంట్స్ చేయడం జరిగింది.ఇలాంటి సమయంలో తాజాగా ఎమ్మెల్సీ కవిత పైన ఒక న్యూస్ అయితే వినిపిస్తోంది.



ఈ న్యూస్ బిఆర్ఎస్ నేతలను , కార్యకర్తలను ఆనందపరిచేలా ఉన్నది. అదేమిటంటే బిఆర్ఎస్ పార్టీ అధినేత కవిత తండ్రి కెసిఆర్ ని కలవబోతున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ కు ఆమె రాసిన లేఖ బిఆర్ఎస్ లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. ఇవాళ ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు మరి కొన్ని గంటలలో వెళ్లి మరి అక్కడ తన తండ్రికి వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి రోజున అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన కవిత పార్టీ అధినేత కేసిఆర్ తో కూడా భేటి కాబోతున్నట్లు తెలుస్తోంది.


అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాత్రి మీడియాతో మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ కవిత తాను తన తండ్రికి రాసినటువంటి లేఖ బయటికి ఎలా వచ్చిందనే విషయంపై తాను ఆశ్చర్యపోయానని.. ఈరోజు మధ్యాహ్నం తన తండ్రిని కలుస్తానని పార్టీ వర్గాలలో కూడా జరుగుతున్న చర్చలపై అన్నిటికీ క్లారిటీ ఇస్తానని తెలిపింది. తాను లేఖలో ప్రస్తావించిన అంశాలు కూడా అవే అంటూ తెలియజేసింది.కానీ అవి ఎలా బహిర్గతంగా బయటికి వచ్చాయని విషయంపై నేరుగా తన తండ్రి కెసిఆర్ తోనే మాట్లాడబోతున్నట్లుగా  వినిపిస్తున్నాయి..మరి ఫామ్ హౌస్ లో అటు ఎమ్మెల్సీ కవితను బిఆర్ఎస్ నేతల మధ్య కెసిఆర్ రాజకుదురుస్తారా లేదా అన్న విషయం చూడాలి.  ఈరోజు సాయంత్రానికి అన్ని విషయాల పైన క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: