
మరి ముఖ్యంగా భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా పాకిస్తాన్ నిర్ణయాలు తీసుకోవడంతోపాటు భారత్ ఇరుకున పడుతుందని అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధిక కమిటీ చైర్మన్ పదవిపై పాకిస్తాన్ కన్నేసింది. చివరకు వైస్ చైర్మన్ హోదాతో సరిపెట్టుకుంది. అయితే తాలిబన్ ఆంక్షలు కమిటీ పగ్గాలను దక్కించుకోవడం ప్రస్తుతం ఉన్న సమయంలో పాకిస్తాన్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా అందరు భావిస్తున్నారు. తాలిబన్లతో ఇస్లామాబాద్కు సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ దగ్గరవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాబూల్కు దగ్గర అయ్యేందుకు ఈ ఆంక్షలు కమిటీ చైర్మన్ పదవిని పాకిస్తాన్ ఉపయోగించుకోనుంది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు