- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ బిజెపి మెదక్ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరు తో  ఫోన్ చేసి బెదిరించారు .  ఇవాళ సాయంత్రం లోగా ఎంపీ ను చంపేస్తామంటూ హెచ్చరించారు .. మధ్యప్రదేశ్ కి చెందిన మావోయిస్టునని ఓ అగాంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.  అయితే ఆ ఫోన్ కాల్‌నీ రఘునందన్ రావు పిఏ లిఫ్ట్ చేశారు .. ఇక  912143352974  ఈ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని దమ్ముంటే కాపాడుకోండి అంటూ రఘునందన్ రావుని అగాంతకుడు బెదిరింపులకు గురి చేశాడు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది .

అలాగే సోమవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పర్యటించారు .. ప‌లు అభివృద్ధి కార్యక్రమాలలోనూ ఎంపీ పాల్గొన్నారు .. అయితే ఈ సమయం లోనే రఘునందన్ రావు కి తెలియని  ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చిందని .  ఆ వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ  డీజీపీ జితేందర్‌కి రెడ్డికి , సంగారెడ్డి ఎస్పీకి ఇతర ఉన్నతా అధికారులకు ఫిర్యాదు చేశారు .. అలాగే రఘునందన్‌ ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలు పెట్టారు . ఆ ఫోన్ కాల్ నెంబర్ ఆధారంగా విచారణ కూడా మొదలు పెట్టారు . ఎక్కడి నుంచి ఆ కాల్‌ వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు .  అదే విధంగా ఈ విషయం పై బీజేపీ అగ్ర నేతలు ఎంపీ రఘునందన్ రావు కి ఫోన్ చేసి వివరాలు అడిగి మరి తెలుసుకున్నారు ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: