
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు రేణు మృతదేహం చేతులు, కాళ్లు తాళ్లతో కట్టబడిన స్థితిలో కనిపించింది. నిందితులు ఆమెను చిత్రహింసలు చేస్తూ కుక్కర్ మూతతో తలపై కొట్టి, గొంతు కోసి హత్య చేశారు. బంగారు, నగదు దోచుకుని పారిపోయారు. హత్య తర్వాత రక్తపు మరకలు దాచేందుకు స్నానం చేసి, యజమాని బైక్లో పరారయ్యారు.
ఇది దోపిడీ హత్యగా అనుమానిస్తున్నారు.ఇంట్లో పని చేసే జార్ఖండ్కు చెందిన ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. 11 రోజుల క్రితం నియమించిన వీరిలో ఒకడు హర్ష్గా గుర్తించారు. లిఫ్ట్ సీసీ కెమెరాల్లో అనుమానాస్పద వ్యక్తులు చెక్ఇన్ అవ్వడం రికార్డయ్యింది. క్లూస్ టీమ్ వేలిముద్రలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తోంది.
బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ పరిశీలించారు.కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. ఈ కేసు ద్వారా గేటెడ్ కమ్యూనిటీల్లో భద్రతా లోపాలు బయటపడ్డాయి. మహిళలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు