అక్కడ టీడీపీ లో కొండ నాలుగు వేస్తే వేద్దామని ప్రయత్నిస్తే ఉన్న నాలుక ఊడేట్టుందట కులాలు, గ్రూపుల గోల  వదిలించుకోవడానికి ఎం ఎల్‌ ఏ చేసిన ప్రయత్నం వికటిస్తోంద‌ట‌. చివ‌ర‌కు ఆయ‌న ఈ గోల‌తో విల‌విల్లాడిపోతోన్న ప‌రిస్థితి. ఆయ‌న ఎవ‌రో కాదు స‌త్తెన‌ప‌ల్లి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనార‌య‌ణ‌. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఇక్కడి నుంచి స్వాతంత్ర సమరయోధుడు, వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగు సార్లు గెలిచారు. 00:00:29 ఇక 2014 లో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు, నర్సారావుపేట్ నుంచి సత్తెనపల్లికి వచ్చి పోటీ చేసి గెలిచారు. 2019లో కోడెల ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు క‌న్నాను టీడీపీలోకి తీసుకువ‌చ్చి ఎమ్మెల్యే సీటు ఇవ్వగా ఆయ‌న విజ‌యం సాధించారు.


గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇక్క‌డ‌ టీడీపీలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివప్రసాదరావు, కొడుకు శివరాం రూరల్ మండలంలోని నేతలు ఇలా ఎవరికి వారు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తున్నారు. అయితే సీటు ద‌క్కించుకున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ అంబటి రాంబాబు మీద ఘన విజయం సాధించారు. కన్నా నియోజకవర్గానికి కొత్త అయిన సత్తెనపల్లి గ్రూప్స్ గురించి కన్నాకు పూర్తి క్లారిటీ ఉంది. పైగా అన్ని గ్రూపులు ఒకే సామాజిక వర్గానికి చెందినవే. నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యమే ఉంటుంది. దీంతో ఒకరికి స‌పోర్ట్ చేస్తే మరొకరు వ్యతిరేకమవుతారని భావించిన కన్నా లక్ష్మీనారాయణ వ్యూహాత్మకంగా పావులు కదిపారు.


తాను ఎక్కువగా బాధ్య‌త తీసుకోకుండా అదే సామాజిక వ‌ర్గానికి చెందిన దరువురి నాగేశ్వరరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించేశారు. అయితే పాత సీనియ‌ర్ నేత‌లు త‌మ‌ను కాద‌ని.. కొత్త‌గా ద‌రువూరికి బాధ్య‌త‌లు ఇవ్వ‌డం ఏంట‌ని అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ట‌. ఏదేమైనా కొండ నాలుక‌కు మందేస్తే .. ఉన్న నాలుక ఊడిపోయింద‌న్న చందంగా ఇప్పుడు స‌త్తెన‌ప‌ల్లి టీడీపీ ప‌రిస్థితి త‌యారైంద‌నే టాక్ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టిగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: