అయినప్పటికీ, ప్రత్యర్థులు బీహార్ ఎన్నికల ఫలితాలను అడ్డుపెట్టుకుని మరో కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఓటమి పాలైతే, ఆయన ఎన్డీఏకు గుడ్బై చెప్పి, కూటమి కుప్పకూలుతుందని... దాంతో కేంద్రంలో మోదీ సర్కార్ మైనారిటీలో పడుతుందని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు. బీహార్లోని ఒక్క ఓటుతోనే కేంద్రంలో అధికారం మారుతుందని కలలు కన్నారు. కానీ, బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆ ప్రచారాలన్నీ పటా పంచల్ అయ్యాయి! బీహార్లో బీజేపీ, జేడీయూ కూటమి ఎన్నడూ లేని అద్భుతమైన మెజారిటీని సాధించింది. దీంతో బీహార్ ఫలితాల నుంచి మోదీకి ఎటువంటి ముప్పు లేదని, విపక్షాల ప్రచారం పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. బీహార్ వంటి కీలకమైన హిందీ బెల్ట్ రాష్ట్రంలో తిరుగులేని విజయం సాధించిన తర్వాత బీజేపీకి, మోదీకి ఇక తిరుగులేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం మోదీ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుంది. ఈ విజయం తర్వాత, రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇక ఆయా రాష్ట్రాల అంశంగానే పరిగణించబడతాయి తప్ప, కేంద్రంలో భూకంపం సృష్టిస్తాయన్న ప్రచారం చేయడానికి ప్రత్యర్థులకు అవకాశం లేకుండా పోయింది. బీజేపీ చేతిలో ఇంకా మూడున్నరేళ్ల కాలం ఉంది. ఈ కాలంలో తాము చేయాలనుకున్న ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయాలని ఆ పార్టీ కఠిన నిర్ణయంతో ఉంది. జనగణన, లోక్సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల ప్రకారం 2029 ఎన్నికలకు వెళ్లడం వంటి లక్ష్యాలను పెట్టుకుంది. బీజేపీ దృష్టి అంతా ఇప్పుడు 2029 ఎన్నికల్లో గెలవడంపైనే ఉంది. సరైన వ్యూహాలు, అపారమైన అధికార బలం కలగలిపితే... నాలుగోసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధానిగా రావాలని బీజేపీ బలంగా ఆశిస్తోంది. మోదీ శకం ముగిసిందన్న వదంతులు ఇక చరిత్రే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి