ఈమె తమిళ కమెడియన్ కృష్ణమూర్తి ,ప్రముఖ గాయకురాలు వసంతకుమారి ల కూతురు. ఇక శ్రీవిద్య పుట్టిన తర్వాత ఈమె తండ్రి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆయన అనారోగ్యం కారణంగా మంచాన పడడంతో , ఆయన తల్లి సినీ ఇండస్ట్రీలో ఎన్నో పాటలు పాడుతూ జీవితాన్ని మొత్తం అక్కడే గడిపి ,ఆర్థికంగా వీరిని పోషించేది . ఒక్కోసారి శ్రీవిద్యకు ఏడ్చినప్పుడు పాలను కూడా పట్టలేనంత దీనస్థితిలో ఉండేవారు. ఇక శ్రీవిద్య కూడా 1966వ సంవత్సరంలో అనగా ఆమెకు 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఇందుకు కారణం ఆర్థిక ఇబ్బందులేనని చెప్పవచ్చు.
అయితే ఈమెకు అమెరికా నుంచి ఒక సైంటిస్ట్ తో వివాహం జరగడానికి సంప్రదింపులు జరిగినా, అప్పటికీ ఆర్థికంగా బాగలేని కారణంగా , వీరి పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఈమె కమల్ హాసన్ తో ప్రేమలో పడింది. ఇక 2008వ సంవత్సరంలో వీరి ప్రేమ కథ ఆధారంగా మలయాళంలో తిరక్క కథ అనే సినిమా కూడా వచ్చింది. అయితే సినీ ఇండస్ట్రీలో కమలహాసన్ ప్రవర్తన , అతను ప్రవర్తించే ధోరణి అందరికీ బాగా తెలియడంతో, వీరి ప్రేమ వర్క్ ఔట్ కాలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత జాన్స్ థామస్ అనే ఒక డైరెక్టర్ ను వివాహం చేసుకుంది.
అయితే ఇతను కూడా కట్నం వేధింపులు ఎక్కువ చేయడంతో భరించలేక, అతని నుంచి విడాకులు తీసుకుంది. ఆ తరువాత చెన్నై వదిలి తిరువనంతపురం వెళ్ళిపోయింది. ఇక ఆమెకు స్పైనల్ క్యాన్సర్ వచ్చింది. ఇక ఎమ్మెల్యే అలాగే సినీ నటులైన గణేష్ కుమార్ కు ఒక వీలునామా వ్రాసి, ఆమె కన్నుమూసింది. ఆ తర్వాత ఈమె తమ్ముడు కూడా ఆస్తి కోసం తగాదాలు పెట్టుకున్నా, గణేష్ అందుకు ఒప్పుకోలేదు. ఆమె ఆస్తిపాస్తులను మొత్తం గణేష్ గాంధీభవన్ , స్నేహభవన్ లకు ఆస్తి మొత్తం వ్రాసి, ఇవ్వాలని అనుకున్నాడు. ఇలా ఎందుకంటే అక్కడ ఆ రెండు భవనాలలో మానసికంగా సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలను చూసుకోవడం కోసమే ఈ డబ్బును కేటాయించాడు. అయితే ఇది ఆమె చిరకాల కోరిక. అందుకే ఆమె స్నేహితుడు గణేష్ ఇలా చేయడం అందరికీ హర్ష భావంగా మిగిలింది.