అయితే వరుసగా ఓటమిని చవి చూడటం తో ప్రస్తుతం హైదరాబాద్ జట్టు ప్లే అప్ కి అర్హత సాధించాలి అంటే ప్రతి మ్యాచ్ కూడా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఐపీఎల్ ఫోరూ ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా సాగుతోంది. అయితే నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ఆసక్తికర పోరు జరిగనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని అటు క్రికెట్ ప్రేక్షకులందరిలో ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వరుసగా రెండు ఓటమిలు చవిచూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కసితో ఉంది.
ఇక మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆప్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే మాత్రం తప్పని సరిగా గెలవాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఓడిపోతే ఇక ఐపీఎల్ను లీగ్ దశ నుంచే నిష్క్రమించాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చావో రేవో తేల్చుకునే మ్యాచ్ గా మారబోతుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఇక హైదరాబాద్ అభిమానులందరూ నేడు జరగబోయే మ్యాచ్ లో సన్రైజర్స్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు.