ఇటీవలే భారత క్రికెట్లో కెప్టెన్సీ మార్పు అంశం కాస్త ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. అయితే టి20 కెప్టెన్సీ  నుంచి తప్పుకోవడం కారణంగానే విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించాలి వచ్చింది అంటూ అటు బీసీసీఐ చైర్మన్ వివరణ ఇచ్చారు.. అయితే సెలెక్షన్ కమిటీ తరఫున బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ మాట్లాడటం ఎవరికీ అంతగా నచ్చలేదు అని చెప్పాలి. అదేసమయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కెప్టెన్సీ మార్పు చేశారంటూ ప్రెస్ మీట్ లో విరాట్ కోహ్లీ చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

 ఇకపోతే ఇటీవల  కాలంలో ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాట ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇటీవలే ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్ సర్కార్ స్పందించారు. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడం అసలు బాగాలేదు అంటు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బిసిసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ తీరును కూడా తప్పుబట్టారు దిలీప్ వెంగ్ సర్కార్. బీసీసీఐ అధ్యక్షుడు గంగులు సెలక్షన్ కమిటీ తరఫున మాట్లాడటం అతని పని కాదు అంటూ చెప్పుకొచ్చారు. జుట్టు ఎంపిక కెప్టెన్సీ   మార్పు వ్యవహారం ఎలక్షన్ కమిటీ కి చెందుతుంది  అంటూ వ్యాఖ్యానించారు దిలీప్ వెంగ్ సర్కార్.


 బి సి సిఐ ఈ విషయంలో ఎంతో సమర్ధవంతంగా వ్యవహరించి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సౌరవ్ గంగూలీ బిసిసిఐ కెప్టెన్ మాత్రమేనని అయితే జట్టు ఎంపిక  గురించి కేవలం సెలక్షన్ కమిటీ మాట్లాడాలి అంటూ దిలీప్ వెంగ్ సర్కార్ అన్నారు. కెప్టెన్ ఎంపిక తొలగింపు కూడా పూర్తిగా సెలక్షన్ కమిటీ బాధ్యత.. చైర్మన్ సౌరబ్ గంగూలీ అధికార పరిధి కాదు. ఇప్పటికైనా పరిస్థితులు మారితే బాగుంటుంది. కోహ్లీని గౌరవించాలి. విరాట్ కోహ్లీ భారత్ క్రికెట్ టీం కి ఎంతో  చేశాడు దిలీప్ వెంగ్ సర్కార్  వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: