సాధారణంగా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా క్రికెట్ ఎంతలా  ఎంటర్ టైన్మెంట్ పంచుతూఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరిని కూడా టీవీలకు అతుక్కుపోయెలా చేస్తూ ఉంటుంది. ఇంకొంతమంది ఇక స్టేడియం కు వచ్చేలా చేస్తూ ఉంటుంది. నరాలు తెగే ఉత్కంఠ ను అటు ప్రేక్షకులలో కలిగిస్తూ ఉంటుంది. అయితే మైదానంలో క్రికెటర్లు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఇక ఆ మ్యాచ్ లో జరిగిన విషయాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా కామెంటర్లు    కీలకపాత్ర వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఎవరైనా బ్యాట్స్మెన్ సిక్సర్ కొడితే దానిని ప్రేక్షకులందరికీ చేరే విధంగా చెబుతూ ఉంటారు. ఇలా తన కామెంట్రీ తోనే మ్యాచ్ కి ప్రాణం పోస్తూ ఉంటారు ఎంతోమంది. అలాంటి వారిలో హర్ష భోగ్లే కూడా ఒకరు. ప్రస్తుతం ప్రముఖ కామెంటేటర్ లలో ఒకరిగా కొనసాగుతున్నారు హర్ష భోగ్లే. ఇకపోతే ఇప్పుడు హర్షా భోగ్లే కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.  క్రికెటర్లకు సంబంధించిన వార్త లాగానే హర్షా భోగ్లే కు సంబంధించిన వార్త కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.


 ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ముంబై పోలీసులు వెంటనే స్పందించి ఆయన ఆస్పత్రిలో చేర్పించారు అని తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లైవ్  లో క్రికెట్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఇక హర్ష భోగ్లే పై దాడి జరిగింది. అదంతా వీడియోలో రికార్డు అయింది. అయితే ఇక హర్ష భోగ్లే పై ఎవరు దాడి చేశారు అన్న దానిపై మాత్రం వివరాలు తెలియాల్సి ఉంది.  హర్ష భోగ్లే కు ఏమైందో సమాచారం లేదని ఆయన తో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ స్టార్ స్పోర్ట్స్ తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి: