టీమిండియా లో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న వారు గాయాల బారిన పడటమే ప్రస్తుతం టీమిండియాకు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పటికే యువ పేసర్ హాస్టల్ పటేల్ గాయం బారిన పడ్డాడు. ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు దూరమయ్యాడు. కేవలం ఒక ఓవర్ వేసి నుంచి మైదానం బయటికి వెళ్లాడు. అతని గాయం పై ఇప్పుడు వరకు స్పష్టత లేదు. నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో సౌత్ ఆఫ్రికా టి20 సిరీస్కు అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది.
మరోవైపు స్టార్ ప్లేయర్ దీపక్ చాహర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలక బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే గాయాల తో బాధపడుతూ ఐపీఎల్లో జట్లకు దూరమయ్యారు. ఇక ఇదే సమయంలో టీమిండియా అప్కమింగ్ మూడు సిరీస్ల కోసం మూడు వేరు వేరు జట్లను ఎంపిక చేసేందుకు చేతన్ శర్మ సారథ్యంలోని కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం గురించి కూడా చర్చించనున్నారు. కాగా ప్రస్తుతం ఎంతో మంది స్టార్ ప్లేయర్ గాయాల బారినపడి కోలూకుంటున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపిక విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది..