అయితే ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ప్రతి సీజన్లో కూడా ధోని కొనసాగుతూనే వస్తున్నాడు. కానీ ఇక ఇదే దోనికి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా అంటే మాత్రం అందరూ అవును అని చెబుతున్నారు. ఎందుకంటే ఇక ఇటీవల కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజుకి సారధ్య బాధితులు అప్పగించాడు ధోని. దీంతో ఈ ఒక్క సీజన్ తర్వాత 42 ఏళ్ల ధోని రిటైర్మెంట్ ఆలోచన చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే 2024 ఐపిఎల్ సీజన్ ధోని ఆట ఎలా ఉంటుందో చూడ్డానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించడం నిజమే అయితే.. ఇక ధోని అభిమానులు మాత్రం ఒక కోరిక కోరుకుంటున్నారు. ఈ సీజన్లో ధోని తన మునుపటి మెరుపులు మెరిపించాలని కోరుకుంటున్నారు. కెప్టెన్సీ భారం లేనందున టాప్ ఆర్డర్లో బరిలోకి దిగి దూకుడుగా ఆడాలని ఆశిస్తున్నారు. రెప్ప పాటు కాలంలో చేసే స్థంపింగ్స్ హెలికాప్టర్ షాట్లు భారీ సిక్సర్లతో విరుచుకుపడి అభిమానులకు తన ఆటతో మంచి ట్రీట్ ఇచ్చి వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.