మహేంద్రసింగ్ ధోని క్రికెట్ కెరియర్ చివరి దశకు చేరుకుందా అని అడిగితే ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా అవును అనే మాటే వినిపిస్తుంది. ఎందుకంటే ఎందుకంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో సాధించాడు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియాకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ లను.. తన కెప్టెన్సీ లోనే రెండుసార్లు అందించాడు. ఏకంగా భారత జట్టును ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే 2019లో ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్ లో ఆడుతూ క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాడు.


 అయితే ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ప్రతి సీజన్లో కూడా ధోని కొనసాగుతూనే వస్తున్నాడు. కానీ ఇక ఇదే దోనికి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా అంటే మాత్రం అందరూ అవును అని చెబుతున్నారు. ఎందుకంటే ఇక ఇటీవల కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజుకి సారధ్య బాధితులు అప్పగించాడు ధోని. దీంతో ఈ ఒక్క సీజన్ తర్వాత 42 ఏళ్ల ధోని రిటైర్మెంట్ ఆలోచన చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.


 ఈ క్రమంలోనే 2024 ఐపిఎల్ సీజన్ ధోని ఆట ఎలా ఉంటుందో చూడ్డానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి.  అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించడం నిజమే అయితే.. ఇక ధోని అభిమానులు మాత్రం ఒక కోరిక కోరుకుంటున్నారు. ఈ సీజన్లో ధోని తన మునుపటి మెరుపులు మెరిపించాలని కోరుకుంటున్నారు. కెప్టెన్సీ భారం లేనందున టాప్ ఆర్డర్లో బరిలోకి దిగి దూకుడుగా ఆడాలని ఆశిస్తున్నారు. రెప్ప పాటు కాలంలో చేసే స్థంపింగ్స్ హెలికాప్టర్ షాట్లు భారీ సిక్సర్లతో విరుచుకుపడి అభిమానులకు తన ఆటతో మంచి ట్రీట్ ఇచ్చి వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: