దేశంలో పెట్రోల్ రేటులు బాగా పెరిగిపోవడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలనే ఎక్కువగా కొనడానికి ఇష్టపడుతున్నారు.ఇక ఫేమస్ ఇండియన్ ఎలక్ట్రిక్‌ బైక్ల తయారీ కంపెనీ రివోల్ట్‌ ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు మంచి శుభవార్తను అందించింది.ఇక తక్కువ ధరలో ఆర్‌వీ1 అనే కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించడం జరిగింది. కాగా ఈ కొత్త బైక్‌ ధర వచ్చేసి ప్రస్తుతం ఉన్న ఆర్‌వీ 300 కన్నా తక్కువ ధరలో ఉంటుందని కంపెనీ పేర్కొనడం జరిగింది. ఇక వచ్చే సంవత్సరం నుంచి ఆర్‌వీ1 ఉత్పత్తిలోకి వస్తుందని రట్టన్‌ ఇండియా ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈఎల్‌) ప్రమోటర్‌ అంజలి రట్టన్‌ ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది.

ఇక గుర్గావ్‌కు చెందిన రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం ఆర్‌వీ 400 ఇంకా  ఆర్‌వీ 300 అనే రెండు ఎలక్ట్రిక్ బైకులు ఇండియా మార్కెట్‌లో లభిస్తున్నాయి. రివోల్ట్ మోటార్‌లో సుమారు 43 శాతం వాటాను 150 కోట్ల రూపాయలతో రట్టన్‌ ఇండియా ఎంటర్‌ ప్రైజెస్‌ కొనుగోలు చేయడం జరిగింది.ఇక వచ్చే ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి ఐదు లక్షల బైక్‌లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందట. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్‌-2 తాజా సవరణల్లో భాగంగా రివోల్ట్‌ బైక్‌ ధరలు గణనీయంగా తగ్గడం జరిగింది.ఇక రివోల్ట్‌ ఆర్‌వీ 400 ప్రస్తుతం ఢిల్లీలో ఎక్స్‌ షోరూమ్‌ ధర వచ్చేసి రూ. 90, 799గా ఉంది, అయితే రివోల్ట్‌ నుంచి వచ్చే కొత్త ఆర్‌వీ1 మోడల్ ధర వచ్చేసి రూ. 75 వేల నుంచి రూ. 80 వేల మధ్య ధర ఉండొచ్చునని తెలుస్తోంది. అలాగే తాజాగా రివోల్ట్‌ కంపెనీ డోమినోస్‌ పిజ్జాతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. కొన్ని రోజుల క్రితం రివోల్ట్‌ ఉంచిన ప్రీ బుకింగ్స్‌లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: