భారత్‌లో భూతాపం ప్రభావం తీవ్రంగా ఉన్నది. మిగతా వాటిలో కన్నా  హిందూ మహాసముద్రంలోనే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతు ఉన్నాయి. దీనివల్ల భారత దేశంలో భీకర వర్షాలు, వరదలు తప్పవు. ఉష్ణోగ్రతలూ హెచ్చుస్థాయిలోనే నమోదు అవుతాయి. దక్షిణాసియాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని తక్షణమే అడ్డు కట్ట వేయాలి. లేదంటే భవిష్యత్తులో ఇక మనం కట్టడి చేయలేం.  రాబోవు పదేళ్లలో కరవు, కార్చిచ్చులు, వడగాడ్పులు, తుపాన్లు మరింత తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయి. సముద్ర మట్టాలు కూడా పెరుగుతాయి. వాతావరణ మార్పులపై ఐరాస నియమించిన అంతర ప్రభుత్వ కమిటీ  ఒక నివేదిక విడుదల చేసింది. భూతాపంపై ఐపీసీసీ ఆందోళనకర విషయాలను వెల్లడించినది .

 వంద సంవత్సరాలకు ఒకసారి  సముద్రమట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు. ఈ శతాబ్దం చివరిలో ప్రారంభమై  ఏటా సంభవిస్తాయని హెచ్చరించినది. సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం మొత్తం  కొనసాగుతుందని అంచనా వచ్చింది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలియజేసింది. భూతాపం మరో 1.6 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగితే, తీవ్రమైన సుదీర్ఘ వేసవి, వడ గాడ్పులు,  చలికాలం నిడివి తగ్గడం సంభవిస్తాయని నివేదిక తెలియజేసింది.  ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీల మార్కు చేరితే తీవ్రత మరింత పెరిగి ఆరోగ్యంపైనా పెను ప్రభావం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.  ప్రస్తుత భూతాపాన్ని బట్టి చూస్తే 50 సంవత్సరాలకు ఒకసారి  నమోదయ్యే తీవ్రమైన వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి పది సంవత్సరాలకు ఒకసారి  నమోదవుతాయని తెలిపారు. భూతాపం మరోక డిగ్రీ మేర పెరిగినట్లయితే ఈ ముప్పు ప్రతి ఏడేడ్లకు రెండుసార్లు ఉంటుందని స్పష్టం చేసింది. భూతాపం పెరుగుదల ఈ విధంగా  కొనసాగి నట్లయితే  2030కి లేదా అంతకుముందే 1.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ హద్దును దాటే ప్రమాదం ఉంది.  భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 సంవత్సరాలు  పడుతుంది. ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని 1.4 డిగ్రీల మేర తగ్గించాలనే లక్ష్యన్ని నిర్దేశించుకున్నారు. 2030 నాటికి భూతాపం 1.4 డిగ్రీల మేర పెరిగిపోతూ ఉందని ఐపీసీసీ హెచ్చరించినది.
 
**భయంకర  వర్షాలు**
ఉష్ణోగ్రతల పెరుగుదల కారణం భారత్‌ లాంటి దేశాల్లో వడగాల్పులు ఎక్కువవుతాయి. ఫలితంగా వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వాయువు ఉద్గారాలు పెరిగి గాలి యొక్క నాణ్యత తగ్గిపోతుంది. మిగతా సముద్రాలతో పోల్చి చూస్తే  హిందూ మహాసముద్రమే తొందరగా, ఎక్కువగా వేడెక్కుతోంది. 21వ శతాబ్దం చివరి నాటికి భారత దేశంలో  వానాకాలం సుదీర్ఘంగా ఉంటుందని నివేదిక తయారీ లో పాల్గొన్న ఫ్రెడరిక్‌ ఓటో విశ్లేషించారు. దేశంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం  వల్ల భూమి తమ తేమ  శాతన్ని కోల్పోతుందని, కరువు పరిస్థితులు ఎక్కువవుతాయని పరిశోధనలో పాల్గొన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాపికల్‌ రీసెర్చ్‌లోని వాతావరణ  పరిశోధన కేంద్రం ఈడీ ఆర్‌ క్రిష్ణన్‌ తెలిపారు. పట్టణాల్లో వర్షపాతం పెరగడానికి మధ్య సంబంధం ఉందని తెలిపారు.

 **ఒక్కరూ సురక్షితంగా లేరు**
 వాతావరణ సంక్షోభ ప్రభావం ప్రపంచం మొత్తం  తీవ్రంగా కనిపిస్తూనే ఉన్నది. ఏ ఒక్కరూ కూడా సురక్షితంగా లేరు. పర్యావరణ పరిరక్షణకు మనం  తక్షణం ముందుకు సాగాలి. లేదంటే మన జీవితాలు, జీవనోపాధులు తీవ్రంగా దెబ్బతింటాయని ఐరాస వాతావరణ కార్యనిర్వాహక డైరెక్టర్‌ ఇగ్నెర్‌ ఆండెర్సన్‌ హెచ్చరికలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: