ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన కొమాకి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ రేంజర్ (ranger)ని ఈ వారం మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.రేంజర్ ఎలక్ట్రిక్ బైక్ ని కొన్ని రోజుల క్రితం కంపెనీ అధికారికంగా ఆవిష్కరించిందట ఇంకా ఈ కొత్త ఈ-బైక్ డిజైన్ వివరాలు కూడా వెలువడించారు.రేంజర్ ఇ-క్రూయిజర్ (ranger e-cruiser) దేశంలో విక్రయించే మొదటి బ్యాటరీతో నడిచే క్రూయిజర్ బైక్ అవుతుందట.

కొమాకి రేంజర్ ప్రత్యేకమైన క్రూయిజర్ డిజైన్‌తో రాబోతుంది.మొదటి చూపులోనే ఈ బైక్ బజాజ్ అవెంజర్ కి కొద్దిగా అడ్జస్ట్ వెర్షన్ లాగా కనిపిస్తుందని అయితే, దాని ప్రత్యేక డిజైన్ అంశాలు కూడా సులభంగా కనిపిస్తాయి. బైక్ మెరిసే క్రోమ్‌తో అలంకరించిన రెట్రో-థీమ్ రౌండ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లను కూడా పొందుతుంది. హెడ్‌ల్యాంప్‌లు రెట్రో-థీమ్ సైడ్ ఇండికేటర్‌లను పొందుతాయట.

 
రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ 4-kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 5,000-వాట్ల మోటారుతో వస్తుందని సంస్థ ధృవీకరించిడం జరిగింది.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కూడా ఈ రేంజర్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ కనుక చేస్తే దాదాపు 250 కి.మీల దూరం ప్రయాణించగలదని పేర్కొన్నది.. అంటే భారతదేశంలోనే అత్యంత పొడవైన డ్రైవింగ్ రేంజ్‌తో కొమాకి రేంజర్‌ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా మార్చిందట.ఈ క్రూయిజర్ బైక్ వివిధ రకాల భూభాగాలను అలాగే అన్ని రకాల వాతావరణ పరిస్థితులను కూడా అధిగమించగలదని ఈవి బ్రాండ్ పేర్కొన్నది.

 
పెద్ద హ్యాండిల్‌బార్ మరియు సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే ఫ్యూయల్ ట్యాంక్‌పై గ్లోసీ క్రోమ్-ట్రీటెడ్ డిస్‌ప్లే, వెనుక ప్రయాణీకులకు సౌకర్యవంతమైన అనుభూతిని అందించడానికి బ్యాక్‌రెస్ట్ అదేవిధంగా రెండు వైపులా ఉన్న హార్డ్ ప్యానియర్‌లు లాంగ్ రైడింగ్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బైక్ ని అభివృద్ధి చేసినట్లు సూచిస్తున్నాయి. సైడ్ ఇండికేటర్‌లతో గుండ్రని ఆకారపు టెయిల్‌లైట్ కూడా ఉంటుంది. ఇతర డిజైన్ అంశాలలో లెగ్ గార్డ్, ఫాక్స్ ఎగ్జాస్ట్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

 
ధర
ఈ మోడల్ ధర కొద్ది రోజుల నుండి ప్రకటించబడుతుందట ఇంకా బ్యాటరీతో నడిచే క్రూయిజర్‌ను భారీ ఉత్పత్తిగా లాంచ్ చేయడానికి బడ్జెట్ శ్రేణిలో ధర నిర్ణయించవచ్చని కంపెనీ వాగ్దానం కూడా చేస్తోంది. కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, "కొన్ని విషయాలు ఖచ్చితంగా చేయాలి అయితే మేము ధరను అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నాము. ప్రతి ఒక్కరూ - ముఖ్యంగా సామాన్యులు - భారతదేశంలో తయారు చేసిన నాణ్యతను కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము."అని అన్నారట.


బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల మధ్య ఉండవచ్చని అంతే కాకుండా కోమకి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంకా బైక్‌లను కూడా విక్రయిస్తుందని సమాచారం.వీటి ధర ఎక్స్-షోరూమ్ ధర రూ.30,000 నుండి రూ.1 లక్ష వరకు ఉంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: