టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసు పై నటి పూనమ్ కౌర్ స్పందించింది. ఇది సెలబ్రిటీ ఇష్షు మాత్రమే కాదని వ్యాఖ్యానించింది. పొలిటికల్... బార్డర్... ఆర్థికపరమైన ఇష్యూ అని పూనమ్ వ్యాఖ్యలు చేసింది. త్వరలో డ్రగ్స్ కేసు పై తాను మాట్లాడతానని తన వ్యక్తిగత అనుభవం తెలియజేస్తా అని పూనమ్ చెప్పడం సంచలనంగా మారింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. త్వరలో తన వ్యక్తిగత అనుభవాలు చెబుతానని పూనం వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

పూనమ్ ఏం చెబుతుంది అన్న దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే మొదట ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై విచారణ జరపగా.... ప్రస్తుతం ఈ కేసుపై ఈడి విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈడీ ముందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి కౌర్ హాజరుకాగా ఈరోజు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన  కెల్విన్ తో సెలబ్రిటీలకు ఉన్న సంబంధాలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: