తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా కాలేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఒక మహత్తరమైన ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో పూర్తి చేసింది తెలంగాణ సర్కార్. 

 

 అయితే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ అభివృద్ధి చెందిన విధానం గురించి తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్టు ఒక మహత్తరమైనప్రాజెక్టు అని ... తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకపాత్ర పోషించింది అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి కేసిఆర్. అదే సమయంలో గజ్వేల్ వాసులకు ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే గజ్వేల్ పట్టణాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అయితే గద్వాల పట్టణానికి ప్రతిరూపంగా న్యూ గజ్వేల్  కూడా నిర్మించ తలపెట్టారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తామంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: