ఈ మధ్య కాలంలో తెలంగాణలో కరోనా  వైరస్ కేసులు భారీగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఏకంగా 200 కు పైగా కరోనా  కేసులు నమోదు అవుతు ప్రజలందరిలో  ఆందోళన కలిగిస్తోంది. కేవలం సామాన్య ప్రజలకే కాదు   ఎమ్మెల్యేలకు వారి కింద పనిచేసే అధికారులకు సైతం ఈ మహమ్మారి వైరస్ సోకటం  కలకలం రేపుతోంది. 

 

 తాజాగా తెలంగాణలో మరో ఎమ్మెల్యే కు కరోనా  సోకడం సంచలనంగా మారింది. నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త కరోనా పాజిటివ్  అని  నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణ ఎమ్మెల్యేలు ముత్తి  రెడ్డి,  బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి లతో పాటు.. మంత్రి ఈటెల రాజేందర్ ఓఎస్డి అధికారికి కూడా కరోనా  వైరస్ సోకినట్లయింది . అయితే ఏకంగా ఎమ్మెల్యేలే కరోనా  వైరస్ భారిన పడటం  సంచలనంగా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: