రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోల హడావుడి కాస్త ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినా సరే ఎక్కడా కూడా మావోలు ఆగడం లేదు. విశాఖ జిల్లాలోని రాళ్లగడ్డ సమీపంలో పోలీసులను చంపాలనే ఉద్దేశంతో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను భగ్నం  చేసారు చింతపల్లి పోలీసులు. చింతపల్లి పోలీసుల నుంచి కోరుకొండ కమిటీ మిలీషియా సభ్యులు తప్పించుకున్నారు.

పోలీసుల నుంచి ఎంతోకాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఏసీఎంలు కొర్రా నాగేశ్వరరావు, చిక్కుడు చిన్నారావు కోసం గాలిస్తున్నారు. కొర్ర  నాగేశ్వరరావు, చిక్కుడు చిన్నారావ్ పేర్లు వాడుకుంటూ సంతలో వ్యాపారస్తులు నుంచి వసూళ్లకు లబడంపల్లి గ్రామస్థుడు కూడా కృష్ణారావు పాల్పడుతున్నాడు అని పోలీసులు పేర్కొన్నారు. సంతలో కోడా కృష్ణారావు ను అదుపులోకి  తీసుకున్నారు. ఒక లాండ్ మైన్, 2 డిటోనేటర్ లు, 50 మీటర్ల వైరు, నిప్పో బ్యాటరీ లు, ప్రభుత్వ వ్యతిరేకమైన సాహిత్యాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: