కొన్ని రోజుల పర్యటన నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం హైదరాబాద్ రాజ్ భవన్ లో ఉన్న సంగతి తెలిసిందే.  దీంతో ఆయనను పలువురు రాజకీయ ప్రముఖులు అలాగే సామాజిక వేత్తలు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అయితే తాజాగా ఆయనను తెలుగుదేశం పార్టీ యువనేత, ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కలిశారు.

 భారత దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ ఎన్వి రమణ గారిని హైదరాబాద్ రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నా అని ఆయన తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి సహా చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా ఎన్.వి.రమణ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: