వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా కాస్త ఘాటుగా ఆరోపణలు చేస్తూ  ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబుకి సంబంధించి ఓటుకి నోటు కేసు చార్జ్ షీట్ లో ఆయన పేరు లేకపోవడంపై విజయసాయి ట్విట్టర్ లో స్పందిస్తూ వ్యవస్థల్లో చంద్రబాబుకి ఉన్న పట్టు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. దీన్నిబట్టి అర్థమవుతున్నది ఏమిటంటే అంటూ...

ఓటుకు నోటు కేసులో తన నీడను కూడా తాకలేరన్న ధైర్యంతో ఉన్నాడు బాబు అని ఎద్దేవా చేసారు. వ్యవస్థల్లో తనకున్న పట్టు అలాంటిది అంటూ పేర్కొన్నారు. అందుకే కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వాలను అస్థిర పరచడానికి సాహసిస్తున్నాడు అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వారి ఆటలు ఎల్లకాలం సాగవు అన్నారు విజయసాయి. కాగా ఇటీవల చార్జ్ షీట్ లో ఏసీబీ అధికారులు చంద్రబాబు పేరు లేకుండా దాఖలు చేయడం సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: