అయినా వారిలో ఏ ఒక్కరికీ పిల్లలు పుట్టలేదు. పది మంది భార్యల్లో 5 మంది ఆరోగ్యం బాగోలేక చనిపోయారు. మిగతా భార్యల్లో ముగ్గురు కూడా యాదవ్ ను వదిలేసి వెళ్లారు. మిగిలిన ఇద్దరు భార్యలు యాదవ్ తోనే ఉంటున్నారు. కాగా ఈ ఇద్దరి భార్యల్లోని ఒకమెకు ముందే పెళ్లి అయ్యింది. మొదటి భర్త ద్వారా కలిగిన ఒక కుమారుడు కూడా ఉన్నాడు. యాదవ్ ను ఆమె రెండో వివాహం చేసుకుని తన కుమారుడిని కూడా అక్కడకు తీసుకొచ్చి అతనితో కలిసి ఉంటున్నాడు. అయితే ఈ ఘటనపై భోజిపుర స్టేషన్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. యాదవ్ కు మెయిన్ రోడ్డు పక్కన స్థలం కలిగి ఉన్నాడు. ఆ స్థలానికి మార్కెట్ లో చాలా విలువ కలిగి ఉంది.
అతని ఆస్తిపై కన్నేసిన కొందరు వ్యక్తులు యాదవ్ ను దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు వెళ్లడిస్తున్నారు. పిల్లలు పుట్టకపోవడంతోనే అతను ఇలా పదిపెళ్లిల్లు చేసుకున్నాడు. కానీ పిల్లలు పుట్టకపోవడంతోనే మొదటి వివాహంతో తన భార్యకు పుట్టిన కుమారిడితో ఉంటున్నాడు. కాగా యాదవ్ తండ్రి అతడికి పిల్లలు లేరనే కారణంతో మొత్తం ఆస్తిని తన అన్నకు రాశాడు. దాంతో జగన్ లాల్ పంచాయితీ పెట్టి కొంత భూమిని దక్కించుకున్నాడు. అతని ఆస్తిపైనే కన్నేసిన కొందరు వ్యక్తులు యాదవ్ ను హతమార్చారని పోలీసులు వెళ్లడిస్తున్నారు. బంధువులే యాదవ్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.