డబ్బు మనిషిని మార్చేస్తుంది.. మానవ బంధాల ను తెంచేస్తుంది.. రక్త సంబంధీకులను దూరం చేస్తుంది.. మనిషిలో మానవత్వాన్ని చంపేస్తోంది.. ఇలా డబ్బు మనిషిని బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా క్రూర మృగంలా మార్చుతుంది రోజురోజుకి. దీంతో నేటి రోజుల్లో ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పరాయి వ్యక్తుల నుంచి కాదు ఏకంగా రక్త సంబంధీకుల నుంచి ప్రమాదాలు పొంచి ఉండటంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. ఇక రోజురోజుకు ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా డబ్బు కోసం సొంత వారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.


 ఇక్కడ ఓ మేనమామ ఇలాంటి నీచానికి ఒడిగట్టాడు. మేనమామ అంటే కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకోవాలి. ఏకంగా కూతురిలా చూసుకుంటూ సంతోషంగా ఉంచాలి. కానీ ఇక్కడ మాత్రం డబ్బుకోసం కక్కుర్తి పడ్డాడు మేనమామ. ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సిన మేనమామ 7 ఏళ్ల వయసున్న బాలిక  పాలిట ఎంతో పెద్ద సమస్యగా మారి పోయాడు. డబ్బు కోసం ఏకంగా మేనకోడలికి కిడ్నాప్ చేయించాడు. చివరికి పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కర్నాటకలోని బాగల్కోట్ నవ నగర్ లో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో సునీత అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.


 అయితే ఇటీవలే పిల్లలను ట్యూషన్ నుంచి తీసుకు వస్తున్న సమయంలో మేనమామ మరో ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే 7ఏళ్ల బాలికను  కారులో బలవంతంగా ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. 50 లక్షలు ఇవ్వాలని లేదంటే మీ కూతురు మీకు దక్కదు అంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. మొదట సునీతకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆ బాలికను ఇంటివద్ద వదిలేసి పరారయ్యాడు. ఈ క్రమంలోనే బాలిక చెప్పిన వివరాలతో మేనమామను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నేరం ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: