ఇందుకోసం లక్ష రూపాయల సుపారీ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆ తండ్రి తన కూతురిని హాస్పిటల్ కు తీసుకువెళ్లగా యువతిని చంపేందుకు సుపారీ తీసుకున్న వార్డు బాయ్ ఏకంగా పొటాషియం క్లోరైడ్ హై డోస్ ఇచ్చాడు. దీంతో ఆ యువతి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది వెంటనే మరో ఆస్పత్రికి తన కూతుర్ని తీసుకువెళ్లాడు సదరు వ్యక్తి. ఇక క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం మరింత దిగజారిపోతు వచ్చింది. అయితే విషయాన్ని పరీక్షించగా ఆమెకు పొటాషియం క్లోరైడ్ ఇచ్చినట్లు గుర్తించారు వైద్యులు. ఆ అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చిన వ్యక్తి నరేష్ కుమార్ అని తేలింది.
ఈ క్రమంలోనే పోలీసులు రంగప్రవేశం నరేష్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తన కూతురు ని చంపడానికి ఆ అమ్మాయి తండ్రి లక్ష రూపాయలు ఇచ్చాడు నరేష్ పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ అమ్మాయి తండ్రిని ఇక ఇందుకు సహకరించిన మహిళా ఉద్యోగిని కూడా కస్టడీలోకి తీసుకోవడం గమనార్హం. అయితే ఇక ఆ అమ్మాయి తండ్రి కూడా పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు. తనకు ఇష్టం లేని యువకుడిని ప్రేమించడం కారణంగానే ఇలాంటిది చేశానని ఎన్నిసార్లు హెచ్చరించిన తమ కూతురు వినకపోవడంతో హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు తండ్రి నేరం అంగీకరించాడు.